ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.
బుధవారం ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరు లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.విద్యార్థులు భయందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష వ్రాయలన్నారు. విద్యార్థులు పరీక్షకు ఎంతమంది హాజరయ్యారని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మెడికల్ సిబ్బంది యొక్క పనితీరును పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.