రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక సూపర్ బజార్ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో 2025 – 26 సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీ,బైపిసి గ్రూపులలో మిగిలిన ఖాళీలకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమ రాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కులు,రిజర్వేషన్ల ప్రకారం అర్హత కలిగిన విద్యార్థులు వర్జినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కౌన్సిలింగ్ నిర్వహించి,సీట్లు కేటాయిస్తామని చెప్పారు.