ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ముద్ర” దినపత్రిక 2025 క్యాలెండర్ ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకరావడంలో ముద్ర దినపత్రిక చేస్తున్నప్రయత్నం అభినందనీయమన్నారు. డిజిటల్ పత్రికా రంగంలో తనదైన శైలిలో వార్త కథనాలను ప్రచురిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలువాలన్నారు. ముద్ర దినపత్రిక మరింత జనాధరణ పొందాలన్నారు. కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు దహగాం శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.