Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతోత్సవం:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
మహాత్మ జ్యోతిబా పూలే 200 వ జయంతి సందర్భంగా ఈనెల11న శనివారం ఉదయం 09.00 గంటలకు రోడ్లు భవనాల కార్యాలయం ప్రక్కన గల జ్యోతిబా పూలే విగ్రహానికి పుష్పమాలంకరణ కార్యక్రమం నిర్వచేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతరం,వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ పక్కన,కల్వకుంట రోడ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈకార్యక్రమానికి ప్రజాప్రతినిధులు,అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు,బడుగు బలహీన వర్గాల నాయకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.