- పి ఆర్ టి యు టి ఎస్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : గత సంవత్సరం జగిత్యాల జిల్లాలో ఎస్ఎస్సి జవాబు పత్రాలు మూల్యాంకనం చేసిన కేజీబీవీ ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాల్ల అమర్ నాథ్ రెడ్డి డిఇఓ కోరారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా విద్యాధికారి రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, రాష్ట్రఅసోసియేట్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.