ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సహా పలువురు ఎమ్మెల్యేలు కలిసి అయన కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
