ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గ కేంద్రం లోని జోగిపేట – శ్రీరామ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, డిఆర్వో పాండు,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డాకూరి వెంకటేశం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్లు, తోట్ల రామకృష్ణ, అరుణ్ కుమార్ , కొశిక రాజశేఖర్,నియోజకవర్గ మైనారిటీ నాయకులు, జిల్లా వైద్యాధికారి డా. వసంత్ కుమార్, డిఎస్పి సత్తయ్య గౌడ్, అందోల్ తహసిల్దార్ మధుకర్ రెడ్డి, జోగిపేట సీఐ అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్లు రంగా సురేష్, శరత్ బాబు, పట్లోళ్ల ప్రవీణ్ చిట్యాల మధు, కోరబోయిన నాగరాజు పాల్గొన్నారు.