మంథని, ముద్ర విలేకరి: మంథని పట్టణంలో పలు కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం రాత్రి పరామర్శించారు.ఇటీవల మృతిచెందిన మర్రివాడకు చెందిన మున్నూరు కాపు డివిజన్ మాజీ అధ్యక్షులు బాసాని రాజయ్య, పెంజేరుకట్టలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రిటైర్డ్ CE దేవల్ల తులసీదాస్ తల్లి దేవల్ల రత్నమ్మ, మందాటలో అవధానుల నరసింహ శర్మ, రమేష్ తల్లి అవధానుల జయప్రద,పోచమ్మ వాడకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు సార్ల సంపత్ తండ్రి సార్ల బానయ్య, బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షుడు మాచిడి రవితేజ గౌడ్ అత్తమ్మ ఇటీవల మరణించారు. మంత్రి స్వయంగా వారి ఇళ్ళకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.