ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఎన్ ఆర్ .ఎల్.ఎమ్ అజీవిక గ్రామీణ ఎక్ష్ప్రెస్స్ యోజన స్కీంలో మోటకొండూరు గ్రామానికి చెందిన సమ భావన సంఘాల మహిళ నాంపల్లి భార్గవికి మంజూరైన ఆటోను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం కలెక్టరేట్లో అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.