ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ చేశారు. భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనంద పరవశులైనారు. బుధవారం సకల దోష నివారణార్థం అమావాస్యని పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు.
