ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన భద్రేశ్వర స్వామి వారి హుండీని బుధవారం రోజున ఆలయ కమిటీ అధ్యక్షతన లెక్కించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జాతర కార్యక్రమానికి ముందు స్వామివారి హుండీ ని లెక్కిస్తారు. ఇందులో రూ. 1,లక్ష 22 వేల 736 ఉన్నట్లుగా కమిటీ సభ్యులు నిర్ధారించారు. కార్యక్రమంలో జాతర కమిటీ అధ్యక్షులు మేడి మహేష్ కుమార్, ఈ ఒ శేఖర్ గౌడ్, జాతర కమిటీ డైరెక్టర్లు, వీరశైవ సమాజం అధ్యక్షులు, కార్యదర్శులు, సమాజం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.