ముద్ర, శేరిలింగంపల్లి – విలేకరి: తెలంగాణ రాష్ట్రపశుసంవర్ధక, మత్స్య, క్రీడలు యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి ని మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అయన నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
