ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు ఆశీర్వచనం జరిపి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
