- వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని ముందే సాధించిన ఆర్ జీ వన్.
ముద్ర ప్రతినిధి గోదావరిఖని: రామగుండం డివిజన్ ఏరియా వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ను గురువారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ముద్ర ప్రతినిధి దహగం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జీఎం లలిత్ కుమార్ 2024-25 వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను కార్మికుల సంక్షేమంపై చర్చించారు. సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని ఆర్ జీ వన్ ఏరియా ముందే సాధించి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుందని జిఎం తెలిపారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి యాజమాన్యం శ్రద్ధ కనబరుస్తుందని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.