ముద్ర, నారాయణ పేట:
పట్టణంలోని 11వ వార్డు ఓటర్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి మల్లేష్ సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను. శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి సింహం గుర్తుకి ఓటు వేసి తనను ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వార్డులో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు…అలాగే వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో మౌలిక వసతుల కల్పనకు పాటుపడతానన్నారు.