ముద్ర నడిగూడెం...నడిగూడెం మండల కేంద్రంలో నిర్మించ నున్న ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ గోడౌన్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలమును పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ హర్ష నడిగూడెం తహసిల్దార్ రామకృష్ణారెడ్డి తో కలసి మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులను వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.వారి వెంట ఎంపీఓ విజయలక్ష్మి,ఆర్ఐ లు గోపాలరావు,మల్సుర్, పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి,జిపిఓ కోటయ్య,రెవెన్యూ అధికారులు ఉన్నారు.