Take a fresh look at your lifestyle.

ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ కాంగ్రెస్ ప్రభుత్వంపై టీబీజేపీ అధ్యక్షుడు ఫైర్

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందనే అనుమానం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లో విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందనిఆరోపించారు. ఈ కేసులో దోషులను శిక్షించే చిత్తశుద్ధి సర్కారుకు లేదని విమర్శించారు. నిజంగా ఆ చిత్తశుద్ధే ఉంటే ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి ఉండేవారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఫోన్లు ట్యాపింగ్ చేయించిన నాయకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.