ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపెల్లి మండల కేంద్రంలోనీ చింతకుంటలో డిసిఎంఎస్ ద్వారా ఏర్పాటుచేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించి రైతులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు… కేంద్రంలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయించాల్సిందిగా కోరారు. వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ తో మాట్లాడి హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. దాంతోపాటు… కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని… ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలను చేపట్టాలని అధికారులకు సూచించారు.