28వ వార్డు బి.ఆర్.ఎస్ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి : బి.ఆర్.ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో 28వ వార్డు బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ ఓటర్లను కోరారు. సోమవారం 28వ వార్డు బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేశం కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డ్ ఇన్చార్జ్ డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, జనగాం పాండు, తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, చిందం మల్లిఖార్జున్, శెట్టి బాలయ్య యాదవ్, బల్గురి మధుసూదన్ రెడ్డి, జక్క రాఘవేందర్ రెడ్డి, కేశవపట్నం రమేష్, మాజీ కౌన్సిలర్ వెల్దుర్తి రఘు, వార్డు అధ్యక్షుడు నర్సిరెడ్డి, హీరేకర్ అమర్నాథ్, తదితర నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.