జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలు నిందితుడి అరెస్ట్, రూ. 1.80 నగదు, బంగారం రికవరీ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్
ముద్ర ప్రతినిధి, మెదక్:
జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
అతని వద్ద నుంచి బంగారు, వెండి నగలు, నగదు స్వాధీనం చేసుకొన్నట్లు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. ఈ మేరకు మెదక్ టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. హవేళీ ఘనపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన మాచబోయిన మహేష్ కుమార్ అనే యువకుడు జల్సాలకు, అమ్మాయిలతో సరదాలకు అలవాటుపడి అందుకు డబ్బుల కోసం తాళం వేసి ఉన్న ఇళ్ళు, ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతు తరచు జైలుకు వెళతాడు. ఈ క్రమంలో డబ్బు అవసరమైన సమయంలో ముందస్తుగానే ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి పూట చోరీలకు పాల్పడుతుండగా శనివారం మెదక్ పట్టణంలోని జేఎన్ రోడ్డులో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దొంగతనాలకు పాల్పడుతున్న మహేష్ కుమార్ వద్ద నుంచి రూ.1.80 లక్షల విలువైన బంగారు నగలతో పాటు ఆలయాల వద్ద చోరీ చేసిన రూ.25,348 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మహేష్ కుమార్పై ఒక మర్డర్ కేసు ఉండగా మరో తొమ్మిది ఇతర కేసులున్నాయి. దొంగనాలకు పాల్పడుతున్న నిందితున్ని పట్టుకోవడంలో మెదక్ టౌన్ పోలీసులతో పాటు సీసీఎస్ పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్టు చేసినట్లు మహేష్ తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన మహేష్ కుమార్ ఈనెల 11వ తేదీన జైలు నుంచి విడుదలై తిరిగి 12వ తేదీన మిలటరీ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో దొంగతనం చేసినట్లు ఇన్స్పెక్టర్ మహేశ్ వివరించారు.