ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం డిపో మేనేజర్ కె.కల్పన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఉత్తమంగా డిపో అభివృద్ధికి కృషి చేసిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులను డిపో మేనేజర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఎఫ్ కవిత, ఎస్ టి ఐ శ్రీనివాసు, ఆఫీస్ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
