కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్ కి 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించి, ఇప్పటి వరకు ఎలాంటి బోనస్ ఇవ్వనందున వెంటనే రైతుల ఖాతాలో బోనస్ వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజు మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, పిడుగు ఆనంద్ రెడ్డి, గాందారి శ్రీనివాస్, కంటే రాజం, కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్, గడ్డం జీవన్ రెడ్డి, తెడ్డు మహేష్, కోరుట్ల రాజేష్, అన్నం మహేష్, గంగమల్లయ్య, శాంతారం పాల్గొన్నారు.