రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : భూపాలపల్లి కేంద్రంగా ఈ నెల 11 న నిర్వహించే రెండు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల విలీన సభను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియూ)రాష్ట్ర అధ్యక్షుడు డీ. బ్రహ్మానందం పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లేష్,శేఖర్,వెంకటేష్,శివ,అప్పారావు,మల్లయ్య పాల్గొన్నారు.