Take a fresh look at your lifestyle.

పెంపుడు జంతువులకు విధిగా టీకాలు వేయించాలి

  • రేబిస్ ప్రాణాంతకమైన వ్యాధి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • తుంగతుర్తి పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్.

తుంగతుర్తి, ముద్ర: పెంపుడు జంతువులైనటువంటి శునకాలకు తప్పనిసరిగా యాంటీ రైబిస్ టీకాలను వేయించాలని తద్వారా రాబిస్ వ్యాధిని కొంతవరకు అరికట్టవచ్చని తుంగతుర్తి ప్రభుత్వ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ .రవి ప్రసాద్ అన్నారు. బేబీస్ వ్యాధి శునకాల నుండి మనుషులకు సోకుతుందని ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు సంక్రమించకుండా ఉండాలంటే పెంపుడు జంతువులకు తప్పకుండా టీకాలు వేయించుకోవాలని అన్నారు. ప్రపంచ జొనాసిస్ డే సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో ఆదివారం 26 పెంపుడు కుక్కలకు యాంటీ రైబిస్ టీకాలను వేశారు. కార్యక్రమంలో డాక్టర్ నరేష్, గోపాలమిత్ర శ్రీనివాసరెడ్డి, విజయ్, బుచ్చిబాబు పెంపుడు శునకాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.