Take a fresh look at your lifestyle.

యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీ హబ్ సహకారం

  • యువత జాబ్ సీకర్ గా కాకుండా జాబ్ ప్రోవైడర్ గా మారాలి
  • ఐడియేషన్ బూట్ క్యాంపులో కలెక్టర్ శ్రీహర్ష

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: యువత ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు వీ హబ్ సహకారం అందిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యార్థులకు నిర్వహించిన ఐడియేషన్ బూట్ క్యాంపులో పాల్గొని ప్రసంగించారు.విద్యార్థులు జాబ్ చేసే ధోరణి నుంచి జాబ్ లు సృష్టించాలనే లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. చిన్నతనం నుంచి మనం పెరిగిన వాతావరణం ఒక మంచి జాబ్ దొరికితే లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆలోచన మనకు ప్రేరేపిస్తుందని,వీ హబ్ ద్వారా యువతకు మరోవైపు గల అవకాశాలు, యువత ఆశయాలకు తోడ్పాటు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.చుట్టూ ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో వినూత్న ఆలోచనలు చేసి యువత పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించిందని తెలిపారు.స్విగ్గి, ఓయో, రాపిడో, ఓలా వంటి వివిధ కంపెనీలు చిన్న చిన్న ఆలోచనలతో ప్రారంభమయ్యాయన్నారు.యువత తనకు పరిమితులు విధించుకోవద్దని,మనం ఆలోచిస్తే సమాజంలో అనేక అవకాశాలు వస్తాయన్నారు.చిన్న చిన్న ఆలోచనలతో వచ్చే యువతకు వీ హబ్ ద్వారా వివిధ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు.మన చుట్టూ ఉన్న ఏదైనా సమస్య పరిష్కారానికి యువత ఐడియాతో వస్తే,అది కార్యరూపం దాల్చేందుకు అవసరమైన ఫైనాన్స్ సపోర్ట్, మార్కెటింగ్,ప్రోడక్ట్ తయారీ వంటి వివిధ దశల్లో తోడ్పాటు అందించేందుకు వీ హబ్ పనిచేస్తుందన్నారు.యువత ఆలోచనకు సపోర్ట్ చేసేలా వీ హబ్ లో ఎకో సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ మాట్లాడుతూ, 2018 లో వీ హబ్ ను గ్లోబల్ ఎకనామిక్ సమ్మెలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.సోషల్ ఇంపాక్ట్ లో భాగంగా మహిళలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ అందిస్తామని తెలిపారు.17 నుంచి 23 వయసు మధ్యలో గల మహిళ విద్యార్థులకు శిక్షణ అందిస్తామన్నారు.వీ హబ్ ద్వారా మహిళా ఎంటర్ ప్రెన్యూర్ లను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.సొంత ఐడియా ఉన్న మహిళలకు సొంత వ్యాపార ఏర్పాటుకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వీ-హబ్ సంచాలకులు జహీద్ అక్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, స్టూడెంట్ ప్రోగ్రామ్ లీడ్ జై, ప్రాజెక్టు కోఆర్డినేటర్ సాయిరాం, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తి కాంత్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మురళి, గోదావరిఖని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉష,విద్యార్థిని విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.