Take a fresh look at your lifestyle.

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

  • మంత్రి శ్రీధర్ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రకటించారు. పంటలు నష్టపోయిన, దెబ్బతిన్న రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పంటనష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ అకాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా, ధాన్యం, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు త్వరలోనే పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.అయితే ఈ ప్రకటన రైతుల్లో ఆశాభావాన్ని కలిగించినప్పటికీ, పరిహారం మొత్తం, విధానం గురించి ఇంకా స్పష్టమైన వివరాలు వెల్లడి కాలేదు.

Leave A Reply

Your email address will not be published.