Take a fresh look at your lifestyle.

జనాభా లెక్కలు ప్రక్రియపై కలెక్టర్‌తో బీజేపీ నాయకుల భేటీ

 

ముద్ర కాప్రా

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో కొనసాగుతున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఆయన కార్యాలయంలో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, ప్రస్తుతం జరుగుతున్న తీరుతెన్నులు, ప్రజలకు కలిగే ఇబ్బందులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ,బీజేపీ నాయకులు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, బుద్ధి శ్రీనివాస్, ఎం. కాంతారావు, గొరిగి కృష్ణ, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.