ముద్ర.వీపనగండ్ల: మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 72 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 69 మంది విద్యార్థులు హాజరయ్యారని,ముగ్గురు విద్యార్థులు పరీక్షకు గైరాజరైనట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ లక్ష్మినారాయణ తెలిపారు.పరీక్ష కేంద్రం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ కే రాణి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.