Take a fresh look at your lifestyle.

విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించాలి – జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు

  • నారాయణ ఈ-టెక్నో స్కూల్‌లో అకాడమిక్ ఫెయిర్-2025 విజయవంతం

వనపర్తి: జిల్లా కేంద్రంలోని నారాయణ ఈ-టెక్నో స్కూల్‌లో అకాడమిక్ ఫెయిర్-2025 ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ప్రయోగాత్మక అంశాలను రూపొందించి,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, సందర్శకులకు వివరించారు.విద్యార్థుల రీసెర్చ్ మైండ్, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రదర్శించే ఈ ఫెయిర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

  • విద్యార్థుల విజ్ఞానానికి పునాది – శ్రీనివాసులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, “ఇలాంటి ఫెయిర్‌లు విద్యార్థుల్లో విజ్ఞానానికి పునాది వేస్తాయి.ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా పిల్లలు సైన్స్‌ను గమనించి,అర్థం చేసుకోవడమే కాకుండా,తమ సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం పొందుతారు”అని పేర్కొన్నారు.అలాగే,భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు.

  • సృజనాత్మకతకు వేదిక – గోపాల్ రెడ్డి

నారాయణ స్కూల్స్ జనరల్ మేనేజర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “మా విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం,గణితం,సాంఘిక శాస్త్రం వంటి అన్ని రంగాల్లోనూ వారి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు.విజ్ఞానపరంగా ఇలాంటి ప్రయోగాలు చేయడం ద్వారా వారి సృజనాత్మకత మరింత పెరుగుతుంది” అని అన్నారు.

  • పరిశోధనాత్మక ఆలోచనలకు మద్దతు – వెంకట రమణ రెడ్డి

డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ఫెయిర్ ద్వారా విద్యార్థుల పరిశోధనా ఆలోచనలకు సహకారం అందించాం.సైన్స్,మేథమేటిక్స్,టెక్నాలజీ రంగాల్లో వారు మరింత చొరవ చూపేలా ప్రోత్సహించాం. భవిష్యత్తులో మరింత శ్రద్ధ వహించి, పిల్లలు ప్రపంచ స్థాయి ప్రతిభను ప్రదర్శించేలా మార్గదర్శనం అందిస్తాం”అని తెలిపారు.

  • శాస్త్రవేత్తలుగా ఎదగాలి – వెంకట్ రెడ్డి

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రయోగాత్మక అధ్యయనం ద్వారా విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.పిల్లలు పుస్తకాలకే పరిమితం కాకుండా,ఆచరణాత్మకంగా ప్రయోగాలు చేస్తేనే నిజమైన విజ్ఞానం సాధ్యమవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయిలోనే శాస్త్రవేత్తల్ని తయారు చేయగలవు” అని అభిప్రాయపడ్డారు.

  • విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు

ఈ ఫెయిర్‌లో విద్యార్థులు పలు సైన్స్ ప్రాజెక్టులు, మేథమెటిక్స్ మోడల్స్, సోలార్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్, రోబోటిక్స్ వంటి అంశాలను ప్రదర్శించారు.వర్షపు నీటి సంరక్షణ,ప్రాక్టికల్ ఎలక్ట్రిసిటీ, సముద్రజలాన్ని తాగునీటిగా మార్చే పద్ధతులు,వ్యర్థ పదార్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం వంటి ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

  • తల్లిదండ్రుల ప్రశంసలు

ఫెయిర్ సందర్శించిన తల్లిదండ్రులు,”ఇలాంటి విద్యా కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగకరమైనవి. పుస్తకాలకే పరిమితం కాకుండా,నిజమైన ప్రాయోగిక విజ్ఞానాన్ని అలవరచుకోవడం ఎంతో అవసరం”అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఆర్&డి టీం సభ్యులు అనిల్,స్వాతి,సంగీత, ప్రిన్సిపల్ రామ్మూర్తి, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు.ఫెయిర్ విజయవంతంగా ముగియడానికి టీచర్లు ముఖ్య భూమిక పోషించారు.

Leave A Reply

Your email address will not be published.