Take a fresh look at your lifestyle.

జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

  • ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డ్ లో వివరాలు, బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ యూఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెద్దపెల్లి జిల్లాకు సంబంధించి నమోదు పూర్తయిన ఆధార్ గణాంకాలను తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ 5 నుంచి 15 సంవత్సరాల లోపు గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని కలెక్టర్ సూచించారు. 18 సంవత్సరాలు దాటిన వారి ఆదార్ నమోదుకు సంబంధించి తహసిల్దార్ లాగిన్ లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆధార బయోమెట్రిక్ అప్ డేషన్ కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని, జిల్లాలోని వివిధ అనాధ శరణాలయాల్లో పెరుగుతున్న వారికి ఆధార్ ఎన్ రొల్మెంట్లో వచ్చే సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల రావు, ఇ.డి.ఎం. కవిత, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, జిల్లా వైద్యాధికారి డా.అన్న ప్రసన్న కుమారి, ఎల్ డి ఎం వెంకటేష్, సీఐ ప్రవీణ్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.