ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని 27వ వార్డులోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని, పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో కలిసికట్టుగా జరుపుకునే పండుగ రంజాన్ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బొప్పి కృష్ణ, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.