మాదాపూర్, ముద్ర విలేఖరి: మాదాపూర్ లోని శిల్పారామంలో మూడు రోజుల గురు పౌర్ణిమ ఉత్సవాల సందర్బంగా ఈరోజు గాయత్రీ స్కూల్ అఫ్ కూచిపూడి డాన్స్ , సంచలన స్కూల్ అఫ్ డాన్స్ మరియు సమ్మోహన ఆర్ట్స్ అకాడమీ శిష్య ప్రశిష్యులు ప్రముఖ నాట్య గురువులు పద్మకళ్యాణ్ ఆచార్య అభివందనం కార్యక్రమాన్ని సమర్పించారు. శృంగార లహరి కీర్తన, మధుర మధుర, బాల కనకమయి, గణేశా పంచరత్న, దశావతరం, అష్టపది, మూషిక వాహన, వినరో భాగ్యము, మండూక శాబ్దం, హిందోళ తిల్లాన అంశాలను డాక్టర్ జ్యోతి శేఖర్, డాక్టర్ కిరణ్మయి బోనాల, సంచలన, సమ్మోహన, మైథిలి, లహరి, ఉమామహేశ్వరి, రశ్మిత, జానకి, తన్మయి, గాయత్రీ, వైష్ణవి, హేమలత, లక్ష్మి ప్రియా మొదలైన శిష్య ప్రశిష్యులు పద్మకళ్యాణ్ గురు సత్కారం చేసారు.
