ముద్ర కూకట్పల్లి :
కెపిహెచ్బి 4వ ఫేజ్ లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శనివారం కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుంభాభిషేకం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, ఆధ్యాత్మిక నినాదాలతో మారుమోగాయి. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.