ముద్ర ప్రతినిధి, మెదక్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంట మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, మాజీ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, శంకరంపేట. ఆర్ మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి రాజు, నాయకులు జుబేర్ అహ్మద్, ఫాజిల్, ఫరూక్, అహ్మద్ తదితరులున్నారు.
