ముద్ర, శేరిలింగంపల్లి:
శిల్పారామం మాదాపూర్ లో శివరాత్రి పండుగ పురస్కరించుకొని ఈరోజు శ్రీగీతికా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గురువర్యులు లక్ష్మి కృష్ణ శిష్య బృందం మహా గణపతిమ్, శ్రీ విజ్ఞ రాజాం భజే, శివ శంభో, తిల్లాన, శివ స్తుతి, నటరాజ తాండవం, నృత్యాంజలి తిల్లాన, ఆంగికం మహా దేవా శంకర, శివోహం, కల భైరవాష్టకం, ప్రభు ప్రాణానాదం, ఆది యోగ, నటరాజ నీపాదం, నాగ స్తుతి, శివ భరణం, నటరాజ యోగేశా, చిదంబర నటనం, నాగ భూషిత, ఓం సర్వేశ్వరాయ శివ హారతి మొదలైన అంశాలను ప్రదర్శించారు. సాత్విక, స్ఫూర్తి, శ్రీ శాన్వి, దుర్గ ప్రసన్న, లోకాంక్ష, తనిష్క, సంకీర్తన, చైత్రిక, అద్విత, అనన్య, లక్ష్మి సహస్ర, అక్షిత, శ్రీ వార్షిత, అక్షయ, కీర్తన ఈషా వంటి 150 మంది కళాకారులూ నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.