ముద్ర ప్రతినిధి, మెదక్:
ఫైర్ సర్వీస్ వీక్ -2026 లో భాగంగా మెదక్ ఫైర్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, న్యాయవాదులు, జైలు శాఖ సిబ్బంది 15 మంది రక్తదానం చేశారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ జి. వేణు ప్రారంభించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. వెంకటేశ్ గ పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని నివాస భవనాల్లో అగ్ని అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో ఎల్పీజీ గ్యాస్ భద్రత మరియు ఎలక్ట్రికల్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
