మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మున్సిపల్ నూతన పాలకవర్గం 12 మంది వార్డు సభ్యులతో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు పురపాలక సంఘం ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్ మున్సిపల్ కౌన్సిలర్లచే ప్రాణస్వీకారం చేయించారు. అనంతరం మోత్కూర్ మున్సిపాలిటీ చైర్మన్గా గడ్డం స్వప్న ను కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య ప్రతిపాదించగా మరో కౌన్సిలర్ గనగని శైలజ బలపరిచారు వైస్ చైర్మన్గా పల్లెర్ల వెంకన్నను కార్పోతుల వెంకన్న ప్రతిపాదించగా బి శ్రీకాంత్ గౌడ్ బలపరిచారు. బారిలో ఎవరు లేకపోవడంతో చైర్మన్ ,వైస్ చైర్మన్ పదవులను ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.