ముద్ర నడిగూడెం….
భారతదేశ తొలి ఉప ప్రధాని, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి వేడుకలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎమ్మార్వో సోమగాని సూరయ్య, మండల కేంద్ర సర్పంచ్ దున్న శ్రీనివాస్ హాజరై జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూసుదీర్ఘకాలం బడుగు బలహీన వర్గాల వారికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. జగ్జీవన్ రావు సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండా వెంకన్న గుప్తా, బాణాల నాగరాజు, నాగారపు రాము, దున్న ప్రదీప్,చిలకల ఉ ఉపేందర్, బోనగిరి ఉపేందర్, షేక్ రియాజ్,దళిత బహుజన నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.