ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి:
పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతన నిర్మాణాలు జరిగినందున నూతన కరెంటు లైన్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలు కరెంటు లైను లేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వగా వెంటనే సంబంధిత అధికారులకు నూతన లైను వేయవలసిందిగా ఆదేశించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు సహదేవ్, బ్రహ్మచారి, పోకల సుధాకర్, రాజేశ్వరి పాల్గొన్నారు.