Take a fresh look at your lifestyle.

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది” — జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు.

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

జిల్లా పోలీస్ శాఖలో ఒక స్ఫూర్తిదాయక ఘటన చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సి. లక్ష్మీనారాయణ , తమ కృషి, నిబద్ధతకు ప్రతిఫలంగా ఏఆర్ ఎస్సై (Assistant Reserve Sub Inspector)గా పదోన్నతి పొందారు. ఈ సంతోషకరమైన సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా పదోన్నతి పొందిన అధికారికి స్టార్ తొడిగి అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ — ఉద్యోగ జీవితంలో పదోన్నతి అనేది కేవలం పదవిలో ఎదుగుదల మాత్రమే కాకుండా, బాధ్యతలు మరింతగా పెరిగే దశగా భావించాలి అని అన్నారు. పదోన్నతి ద్వారా వ్యక్తిలో కొత్త ఉత్సాహం, మరింత నిబద్ధత, సేవాభావం పెరగాలని ఆయన సూచించారు.

అదేవిధంగా, విధులను నిర్వర్తించే సమయంలో ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని, శారీరక మరియు మానసికంగా దృఢంగా ఉండటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఆయన వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు సిబ్బంది ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కే. శంకర్ ఆర్.ఐ. అడ్మిన్ నరేష్ పాల్గొని, పదోన్నతి పొందిన అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.