ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం 23వ తేది సోమవారం నుండి జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.