రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బందులో భాగంగా సింగరేణి సివిక్, రైల్వే సేడ్ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 49 రద్దు చేయాలంటూ కాపీలను దగ్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గిరిజనులకు,పేద ప్రజలకు,కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. రవి, లచ్చన్న, లక్ష్మీ, స్వరూప, రాజేశ్వరి పాల్గొన్నారు.