ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పరిధిలోని కొడంగల్ ప్రధాన రోడ్డు మార్గంలో వెలసిన, దశాబ్ది కాలాల నుండి ప్రఖ్యాతిగాంచిన రసూల్ పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంతాన్ని శ్రీరామపురం గా నామకరణం చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీరామపురం గా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా గురువారం రోజున దేవాలయ సమీపంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆంజనేయ స్వామి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.రసూల్ పూర్ ఆంజనేయ స్వామి పేరును శ్రీరామపురం గా నామకరణోత్సవం