తెలంగాణలో ‘బాబు’ పాలన రాష్ట్ర పాలనను సీఎం.. ఆంధ్రా పాలకులకు అప్పజెప్పారు -బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఏ పాలకుల మీదైతే పోరాడి తెలంగాణ సాధించుకున్నామో మళ్లీ ఆ పాలకులే ఇక్కడ రాజ్యమేలుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నామమాత్రంగా సీఎం కుర్చీలో కూర్చుకున్నారని.. పరిపాలన మొత్తం ఆంధ్రా పాలకులకే అప్పజెప్పారని అన్నారు. తెలంగాణను పాలిస్తోందని రేవంత్ రెడ్డి కాదన్న ఆయన చంద్రబాబు డైరెక్షన్ లో పాలన జరుగుతోందని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశ పెట్టారని విమర్శించారు.