ముద్ర, ఆత్మకూరు (ఎం):
ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వి సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ యాన యాస్మిన్ సూచించారు. బుధవారం ఆమె ఆత్మకూరు మండలంలోని సర్వేపల్లి గ్రామం లో మహిళ సంఘ భవనము సందర్శించడం జరిగింది. అనంతరం సర్పంచ్ కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నాగిరెడ్డి,అడిషనల్ డి ఆర్ డి ఓ సురేష్,ఎంపీడీవో రాములు నాయక్, ఏ పీ ఓ రమేష్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఇంజనరేష్, వి బి కే లావణ్య ఎపిఎం,సిసి కొమురయ్య వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.