ముద్ర నడిగూడెం…..
స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ విజయ శ్రీ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.