ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్గా ఎన్నికైన మాడుగుల మండలం మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు శ్రీ సూదిని రామ్ రెడ్డి ని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఈరోజు తన కార్యాలయంలో శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూదిని పద్మా రెడ్డి , మనోహర్ రెడ్డి , మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.