ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కు శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తో పాటు సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ పగిడిగంటం నర్సింహా లకు రాష్ట్ర హై కోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డీజీపీ డా. జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ సీపీ మహంతి, ఏ.జి. సుదర్శన్ రెడ్డి తదితరులు ఘం స్వగతం పలికారు.
