- పట్టుబడ్డ సురక్ష ఏజెన్సీ ఉద్యోగులు.
- దీని వెనకాల బడా ఉద్యోగుల హస్తం ఉందని ఆరోపణలు.
ముద్ర యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో కొండపైన లడ్డూల గోదాం నుండి సుమారు 10 బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్ష ఉద్యోగులు పట్టుబడ్డారు.పూర్తి స్థాయి ఈఓ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి.ఒక్కొక్క బస్తాలు సుమారు 30 కేజీల వరకు ఉంటుందని అంచనా. గోదాంలో పనిచేసే సీసీ కెమెరాలో వైర్లను కట్ చేసి మరీ దొంగతనానికి పాల్పడ్డ ఉద్యోగులు.దీనిపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చేస్తున్నారు స్థానికులు భక్తులు.