ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అధికార ప్రతినిధి, అడక్ కమిటీ మెంబర్ రమేష్ కొప్పుల ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు.
తదుపరి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీగా పాల్గొని ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.